ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రభావం : కేంద్రానికి 15 రోజుల్లో రూ. 7 వేల కోట్లు నష్టం
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ఈ నిర్ణయం ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ ప్రభుత్వ ఖజానాకు మాత్రం భారీ కోతను మిగిల్చింది. ఈ పన్ను తగ్గింపు వల్ల కేంద్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.1.15 లక్షల కోట్ల నుండి రూ.1.8 లక్షల కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోతుందని అంచనా. ఒక దేశ బడ్జెట్లో ఇది ఎంత పెద్ద మొత్తం అంటే, రైతులకు ఇచ్చే పీఎం-కిసాన్ పథకం నిధుల కంటే ఇది రెట్టింపు, అలాగే దేశ విద్యా రంగానికి కేటాయించే వార్షిక బడ్జెట్తో ఇది సమానంగా ఉంది. ఈ నిర్ణయం 15 రోజుల్లో సుమారు రూ. 7,000 కోట్ల ఆదాయ నష్టం కలిగించవచ్చని అంచనా వేశారు. ఈ చర్య, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధాల నేపథ్యంలో.. చమురు కంపెనీల నష్టాలను తగ్గించి, దేశీయంగా డీజిల్, ఏటీఎఫ్ సరఫరా నిలకడగా ఉండేలా సహాయపడుతుంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ముఖ్యంగా వినియోగదారుల ఇంధన ధరలు పెరగకుండా రక్షించడానికి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వసూళ్లలో లోటు తగ్గించడానికి ఉద్దేశించబడింది. చతుర్వేది వివరించినట్లు, ప్రభుత్వం డీజిల్పై లీటరుకు రూ. 21.5, ఏటీఎఫ్పై లీటరుకు రూ. 29.5 ఎగుమతి సుంకాలు విధించింది. ఈ అదనపు సుంకాల ద్వారా, 15 రోజుల్లో ప్రభుత్వం రూ.1,500 కోట్ల ఆదాయం సమకూర్చగలదు.
Comments
Post a Comment