చెరువులో దిగి వల వేసి చేపలు పట్టిన రాహుల్ గాంధీ !
బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఆదివారం జరిగిన ర్యాలీలో లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం చేపల పెంపకందారులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మత్స్యకారులతో కలిసి చెరువులోకి దూకారు. సాంప్రదాయ చేపల వేట ప్రక్రియలో స్థానిక మత్స్యకారులతో కలిసి ఆయన చేపలను వేటాడారు. వీఐపీ చీఫ్ ముఖేష్ సాహ్ని, కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్, తదితరులు కూడా చేపలు పట్టారు. దీనిని చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. రాహుల్ గాంధీ చెరువులోకి దిగి, వల వేసి, చేపలు పట్టడాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి చూశారు. అనంతరం పలువురు స్థానికులు మాట్లాడుతూ ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి దృశ్యాన్ని చూడలేదని చెప్పారు. ఇలాంటి ప్రముఖ నాయకుడు మా మధ్యకు వచ్చి మా సంప్రదాయాలను స్వీకరించడం తమకు గర్వకారణమని వారు అన్నారు. ఈ ప్రత్యేక వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ప్రతిపక్ష నాయకుడు బెగుసరాయ్లో చేపలు పట్టారు. మత్స్యకారులతో మాట్లాడి, వారి పని, సవాళ్లు, పోరాటాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో వీఐపీ పార్టీ వ్యవస్థాపకుడు ముఖేష్ సాహ్ని కూడా అక్కడే ఉన్నారు' అని పార్టీ పేర్కొంది. 'కరువు కాలంలో (పరిమిత కాలం, 3 నెలలు) మత్స్యకార కుటుంబాలకు కుటుంబానికి రూ.5 వేలు సహాయం అందిస్తామని మహా కూటమి హామీ ఇచ్చిందని పార్టీ పేర్కొంది. మత్స్య బీమా పథకం, మార్కెట్ యాక్సెస్, ప్రతి బ్లాక్లో చేపల మార్కెట్లు, శిక్షణా కేంద్రాలు, గ్రాంట్ పథకాలు ఏర్పాటు చేస్తామని, నదులు, చెరువులు స్థిరమైన నీటి రిజర్వాయర్ విధానం కింద పునరుద్ధరించనున్నట్లు తెలిపింది.
Comments
Post a Comment