'వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం'ను దేశంలోని అన్ని సరిహద్దు పల్లెలకు విస్తరిస్తాం !

రా
జస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో జరిగిన బీఎస్ఎఫ్ 60వ ఫౌండేషన్ పెరేడ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొని మాట్లాడుతూ డ్రోన్ల వల్ల తలెత్తుతున్న ముప్పు, ముఖ్యంగా భారత-పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి డ్లోన్ల అనుమానాస్పద కదిలకలను ప్రధానంగా ఆయన ప్రస్తావిస్తూ, డ్రోన్ల అనుమానాస్పద కదలికలు భద్రతా దళాలకు సవాళ్లు విసురుతున్నందున దీనిని సమర్ధవంగా ప్రభుత్వం ఎదుర్కొంటుందని చెప్పారు. లేజర్‌తో కూడిన యాంట్రీ డ్రోన్ గన్ మౌంటెడ్ మెకానిజం ప్రాథమికంగా మంచి ఫలితాలను ఇచ్చినట్టు అమిత్‌షా తెలిపారు. ఈ మెకానిజం ద్వారా పంజాబ్ సరిహద్దుల్లో ప్రత్యర్థి డ్రోన్ల కదలికలను గుర్తించి, కూల్చివేసిన కేసులు 3 శాతం నుంచి 55 శాతానికి పెరిగాయని చెప్పారు. 2023లో సుమారు 110 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకోగా, ఈ ఏడాదిలోనే 260కి పైగా డ్రోన్లను అడ్డుకున్నామని, వీటిల్లో అత్యధికంగా డ్రోన్లు అక్రమంగా ఆయుధాలు, మాదకద్రవ్యాల స్మగ్లి్ంగ్‌కు ఉద్దేశించినవేనని తెలిపారు. ప్రత్యర్థి డ్రోన్ల ముప్పు రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలున్న దృష్ట్యా డీఆర్‌డీఓ, రక్షణ, పరిశోధన సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు అమిత్‌షా తెలిపారు. త్వరలో సమగ్ర 'యాంటీ డ్రోన్ యూనిట్'ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇండియా-బంగ్లాదేశ్, ఇండియా-పాకస్థాన్ సరిహద్దులను శత్రుదుర్భేద్యం చేసేందుకు సమగ్ర సమీకృత నిర్వహణ వ్యవస్థ (సీబీబీఎంఎస్) పురోగతిలో ఉందన్నారు. ఉత్తరాది సరిహద్దు గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న 'వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం' (వీవీపీ)ను దేశంలోని అన్ని సరిహద్దు పల్లెలకు విస్తరిస్తామని తెలిపారు. కొత్తగా శిక్షణ తీసుకున్న 13,226 మందిని బీఎస్‌ఎఫ్‌లోకి తీసుకున్నామని, అదనంగా మరో 4000 మందిని రిక్రూట్ చేసేందుకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం