రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట !
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రామ్ గోపాల్ వర్మ పిటిషన్ ని విచారించి ఆదేశాలు జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మ కేసులో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. వచ్చే సోమవారం వరకు ఆర్జీవీని అరెస్ట్ చెయ్యొద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో వర్మ పిటిషన్ పై హైకోర్టు ఈ విధంగా ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. దీంతో ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఆర్జీవికి ఊరటనిచ్చాయి.
Comments
Post a Comment