కామారెడ్డిలో పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు !
తెలంగాణలోని కామారెడ్డిలో ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటి నాగరాజును కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ స్కూల్ గుర్తింపు రద్దు కోరుతూ ముట్టడించారు. ఉదయం నుంచి ఆందోళన కొనసాగుతుంది. దీంతో జీవదాన్ స్కూల్ పై విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసుల పై రాళ్ళు రువ్వారు. దీంతో పట్టణ సీఐ తలకు గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ కాలు విరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సింధు శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితులను పరిశీలించారు. అయితే..
Comments
Post a Comment