ఆర్థిక మోసం కేసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత సుందర్ సి మీనన్‌ అరెస్ట్‌


కేరళకు చెందిన వ్యాపారవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుందర్ సి మీనన్‌ను.. త్రిసూర్‌ జిల్లాలో ఆర్థిక మోసం ఆరోపణలపై మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక కోర్టు రిమాండ్ విధించిన తరువాత జిల్లా జైలుకు పంపబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో పౌర సన్మాన గ్రహీత అయిన మీనన్, తాను డైరెక్టర్లలో ఒకరైన రెండు సంస్థల పేరుతో వ్యక్తుల నుంచి డిపాజిట్లు స్వీకరించినందుకు సంబంధించి 18 ఆర్థిక మోసాల కేసులను ఎదుర్కొన్నాడు. వివిధ వ్యక్తుల నుండి రూ. 7.78 కోట్లు తీసుకున్నాడని, అయితే స్కీమ్‌ల మెచ్యూరిటీ వ్యవధి తర్వాత డబ్బును తిరిగి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. నిందితుడు 62 మందికి పైగా ఇన్వెస్టర్ల నుంచి డిపాజిట్లు స్వీకరించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనలను ఉల్లంఘించి, మెచ్యూరిటీ వ్యవధి ముగిసినా తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని పోలీసు ప్రకటనలో తెలిపారు. "వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై 18 కేసులు నమోదయ్యాయి," తరువాత దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. నియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధం చట్టం ప్రకారం మీనన్, సంస్థ ఇతర డైరెక్టర్ల ఆస్తులు స్తంభింపజేయబడ్డాయి. వాటిని అటాచ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అరవై మూడేళ్ళ మీనన్ ప్రఖ్యాత త్రిస్సూర్ పూరమ్ నిర్వాహకులలో ఒకరైన తిరువంబాడి దేవస్వోమ్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం