Posts

Showing posts with the label while the BW Tyr has been chartered by BPCL

హార్ముజ్ జలసంధిని దాటిన BW Tyr, BW Elm ఎల్పీజీ నౌకలు

Image
హా ర్ముజ్ జలసంధిని దాటి రెండు ఎల్పీజీ నౌకలు నేడు మన దేశం వైపు పయనమయ్యాయి. హార్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల మన దేశంలో ముడి చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం పడింది. అయితే, చైనా మరియు భారతదేశం వంటి మిత్ర దేశాల నౌకలను మాత్రమే హార్ముజ్ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది.భారతదేశానికి, ఇరాన్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మన దేశ ముడి చమురు, గ్యాస్ సరఫరాకు కలుగుతున్న ఇబ్బందుల గురించి కేంద్ర ప్రభుత్వం ఇరాన్‌తో చర్చలు జరిపింది. దీనిని అర్థం చేసుకున్న ఇరాన్, మన దేశానికి వచ్చే నౌకలకు అనుమతులు మంజూరు చేస్తోంది. భారత్ వస్తున్న BW Tyr, BW Elm అనే గ్యాస్ నౌకలు నేడు హార్ముజ్ జలసంధిని దాటడం ప్రారంభించాయి. దుబాయ్ మరియు రాస్ అల్ ఖైమాకు ఉత్తరాన మొత్తం 5 నౌకలు లంగరు వేసి ఉండగా, వాటిలో ఈ రెండు నౌకలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నౌకలు జలసంధిని దాటి భారతదేశం వైపు ప్రయాణిస్తున్నాయి. ఈ నౌకలు BW గ్రూపుకు చెందినవి. ఇందులో BW Elm నౌకను HPCL సంస్థ, BW Tyr నౌకను BPCL సంస్థ అద్దెకు తీసుకున్నాయి. ఈ రెండు నౌకలు సుమారు 93,000 టన్నుల ఎల్పీజీని మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉన్నాయి. BW Elm నౌక మంగళూరు ఓడరేవుకు, ...