2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి : వరల్డ్ బ్యాంక్ హెచ్చరిక
2050 నాటికి నగరాల్లో ప్రమాదకరమైన వేడిని ఎదుర్కొనే పేదల సంఖ్య 700 శాతం పెరగవచ్చని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడిస్తోంది. ప్రస్తుతం వేడి ప్రభావానికి గురవుతున్న వారి సంఖ్య కంటే 2050లో ఏడు రెట్లు ఎక్కువ మంది పేదలు దీని ప్రభావానికి గురవుతారు. పశ్చిమ ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా నగరాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయి. ఇక్కడ పేద కుటుంబాలు, అనధికారిక కార్మికులు, వృద్ధులు, పిల్లలు మొదటి బాధితులు అవుతారు. వడగాల్పులు మరింత తీవ్రమై, ఎక్కువ కాలం కొనసాగుతాయి. ఫలితంగా ప్రజలు చనిపోతారు, కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, నగరాలు స్తంభించిపోతాయి. వేడిని నియంత్రించకపోతే కలిగే పరిణామాలు వినాశకరం. వ్యాపారాలు స్తంభించిపోతాయి, పాఠశాలలు మూతపడతాయి, ఆసుపత్రులు రోగులతో నిండిపోతాయి. వేడి వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగి విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. కాలుష్యం పెరుగుతుంది. పేదరికం, అసమానతలు మరింత దిగజారతాయి. ప్రజలు నగరాలను విడిచి వలస వెళ్తారు. దేశీయ, అంతర్జాతీయ వలసలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ భారీ నష్టాలను చవిచూస్తుంది. వేడిమి ఇకపై కేవలం కాలానుగుణ సమస్య కాదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేస్తోంది. అది నగరాల మొత్తం వ్యవస్థను ఛిన్...