10 హామీలతో టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల
ప శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసం నుంచి అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గమైన భవానీపూర్లో, తృణమూల్ కాంగ్రెస్ ఒక కొత్త నినాదంతో తన ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసింది. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మనం ఎన్నో కుట్రలను చూస్తుంటాం, కానీ ఈసారి అన్ని హద్దులూ దాటిపోయాయి. ఈ ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, కానీ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం నచ్చకపోవడంతో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదు. దీని వెనుక ఎన్ఆర్సి, నియోజకవర్గాల పునర్విభజన ఉన్నాయని అన్నారు. ఇక్కడ పరిశీలకులుగా నియమితులైన వారికి ఈ ప్రాంతం గురించి గానీ, రాష్ట్రం గురించి గానీ ఎలాంటి అవగాహన లేదు, వారికి రాష్ట్రం గురించి ఏమీ తెలియదు. వారు తమ విధులను ఎలా నిర్వర్తించగలరు? రాష్ట్రపతి పాలన స్థానంలో అప్రకటిత రాష్ట్రపతి పాలన వచ్చింది" అని అన్నారు. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓటమిని చవిచూస్తామని బీజేపీకి తెలుసు. మోదీ జీ, బెంగాల్పై అసూయతోనే మీరు ఇక్కడ అప్రకటిత రాష్ట్రపతి పాలనలో...