Posts

Showing posts with the label Union Budget

సమాచార, ప్రసార శాఖకు రూ.4,551 కోట్లు కేటాయింపు

Image
కేంద్ర బడ్జెట్‌లో సమాచార, ప్రసార శాఖకు రూ.4,551 కోట్లు కేటాయించారు. ఇందులో అధిక భాగం ఆలిండియా రేడియో, ప్రసారభారతికి దక్కనుంది. మిగతా నిధులను యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్‌ రంగాల్లో నైపుణ్యం పెంపుదలకు, కమ్యూనిటీ రేడియో విస్తరణకు కేటాయించారు. 2025-26 బడ్జెట్‌లో ఈ శాఖకు కేటాయించింది రూ.6,103.02 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ దఫా సమాచార, ప్రసార శాఖకు ఇచ్చిన రూ.4,551 కోట్లలో ప్రసారభారతికి రూ.2,291.88 కోట్లను ప్రత్యేకించారు. ఈ నిధులను వేతనాలు, పింఛన్లు తదితరాల కోసం ఖర్చు పెడతారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూ.250 కోట్లను వెచ్చిస్తారు. ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహణ, కొత్త చిత్రాలు, డాక్యుమెంటరీల నిర్మాణానికి రూ.344.55 కోట్లను, ఎఫ్‌ఎం ప్రసారాలతో ఆలిండియా రేడియో నెట్‌వర్క్‌ విస్తరణ, డీటీహెచ్‌ సామర్థ్యం పెంపు వంటి వాటికి రూ.509.24 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో మాదిరిగానే ఈసారి కూడా నిరక్షరాస్యుల కోసం కమ్యూనిటీ రేడియో కార్య క్రమాల నిమిత్తం రూ.8 కోట్లు కేటాయించారు. యానిమేషన్, గేమింగ్, విజువల్‌ ఎఫెక్ట్స్, కామిక్స్‌(ఏవీజీసీ) రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు దేశవ్యాప్త...

ఫిబ్రవరి 1న పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు !

Image
కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి 1, ఆదివారం కూడా  స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి. సాధారణంగా వారాంతాల్లో ట్రేడింగ్‌కు విరామం ఉంటుంది. కానీ బడ్జెట్ వంటి కీలక ఆర్థిక పరిణామాలు ఉన్నప్పుడు మార్కెట్ ఒడిదుడుకులను గమనించడానికి, పెట్టుబడిదారులకు అవకాశం కల్పించడానికి ఎక్స్ఛేంజీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఫిబ్రవరి 1న ఉదయం 9:15 గంటలకు ప్రారంభమయ్యే ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 3:30 గంటల వరకు నిరంతరాయంగా సాగుతుంది. లోక్‌సభ స్పీకర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 1 ఆదివారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. గడచిన కొన్ని సంవత్సరాలుగా ఫిబ్రవరి మొదటి రోజే బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక స్థిరమైన సంప్రదాయంగా మారింది. దీనివల్ల ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికి ముందే పద్దులపై స్పష్టత వస్తుంది. గతంలో 2025, 2020 సంవత్సరాల్లో కూడా బడ్జెట్ శనివారం వచ్చినప్పటికీ ఇన్వెస్టర్ల సౌకర్యార్థం మార్కెట్లను తెరిచి ఉంచిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆదివారం కావడంతో ట్రేడర్లు ఈ ప్రత్యేక సెషన్ కోసం ఆసక్తిగా ఎదురుచ...