నితీష్ కుమార్ కు భద్రత పెంపు !
బీ హార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టం చేసింది. ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో మహిళా డాక్టర్ హిజాబ్ను లాగినట్లు వచ్చిన ఆరోపణలతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో, నిఘా సంస్థల నుంచి కీలక హెచ్చరికలు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నితీష్ కుమార్కు ప్రాణహాని ఉందని, సామాజిక ఉద్రిక్తతల దృష్ట్యా ఆయన భద్రతపై నిరంతరం నిఘా ఉంచాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హోం శాఖ ఆయన భద్రతా ప్రోటోకాల్స్ను సమీక్షించి, ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రికి రక్షణగా ఉన్న స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఇప్పుడు మరింత అప్రమత్తమైంది. నితీష్ కుమార్ ఎక్కడ పర్యటించినా, ఆయన చుట్టూ బహుళ అంచెల భద్రతా వలయం ఉండేలా అధికారులు ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఆయనను కలిసే సందర్శకుల విషయంలో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కేవలం పరిమిత సంఖ్యలో ఉన్నత స్థాయి అధికారులు, అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే ముందస్తు అనుమతితో ఆయనను కలిసే అవకాశం కల్పిస్తున్నారు. బహిరంగ సభలు మరియు కార్యక్రమాల వద్ద అదనపు బలగాలను మోహరిస్తూ, మెటల్ ...