Posts

Showing posts with the label Polling is scheduled to take place on April 9

కేరళ శాసనసభ ఎన్నికలు : తొలి జాబితాను విడుదల చేసిన సీపీఐ

Image
కే రళ శాసనసభ ఎన్నికలకు సీపీఐ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఎన్నికల సంఘం తేదీలను వెల్లడించిన వెంటనే ఈ ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 9న పోలింగ్ జరగనున్నది. పార్టీ మొత్తం 25 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. రెండుసార్లు మాత్రమే పదవిలో ఉండాలనే నిబంధన నుండి మంత్రి కే రాజన్‌కు మినహాయింపు లభించింది. దీంతో ఆయన ఒల్లూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు. జీఆర్ అనిల్- నెడుమంగాడ్, జే చిన్చురాణి- చడయమంగళం, పీ ప్రసాద్- చేర్తల సహా ఇతర ముగ్గురు సీపీఐ మంత్రులు తమ ప్రస్తుత నియోజకవర్గాల నుండే ఎన్నికల బరిలోకి దిగుతారు. త్రిస్సూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే పీ బాలచంద్రన్ స్థానంలో ప్రముఖ కవి, యువకళాసాహితి రాష్ట్ర అధ్యక్షుడు ఆలన్‌కోడ్ లీలాకృష్ణన్ బరిలోకి దిగుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న పరవూర్‌లో ప్రస్తుత కైపమంగళం ఎమ్మెల్యే ఈటీ టైసన్ బరిలో దిగనున్నారు. ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీపీఐ టికెట్ నిరాకరించింది. వీరిలో డిప్యూటీ స్పీకర్ చిట్టాయం గోపకుమార్ తోపాటు ఇ. చంద్రశేఖరన్, ఈకే విజయన్, పీ బాలచంద్రన్, సీసీ ముకుందన్, సీకే ఆశా, పీ సుపాల్, జీఎస్ జయలాల్ ఉన్నారు...