Posts

Showing posts with the label Over 200 houses demolished in Karnataka

కర్ణాటకలో 200కు పైగా ఇళ్లు కూల్చివేత : కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువ !

Image
క ర్ణాటకలో 200కుపైగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో సుమారు 400 ముస్లిం కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఉత్తరాది రాష్ట్రాల బుల్డోజర్ చర్యను ఇక్కడ అమలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.  డిసెంబర్ 22న తెల్లవారుజామున 4 గంటల సమయంలో బెంగళూరు శివారు కోగిలు గ్రామంలోని ఫకీర్ కాలనీ, వాసిం లేఅవుట్‌లోని సుమారు 200కు పైగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ నిర్వహించిన ఈ డ్రైవ్‌లో నాలుగు జేసీబీలు వినియోగించారు. 150 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. ఉర్దూ ప్రభుత్వ స్కూల్‌కు ఆనుకుని ఉన్న సరస్సు ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది. ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. కాగా, వందల సంఖ్యలో ఇళ్లను కూల్చివేయడంతో సుమారు 400కు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వీరిలో ఎక్కువగా ముస్లిం కుటుంబాలే ఉన్నాయి. తమకు ముందస్తు నోటీసు అందలేదని, పోలీసులు బలవంతంగా తమను ఖాళీ చేయించి ఇళ్లను కూల్చివేశారని నివాసితులు ఆరోపించారు. తీవ్ర చలికాలంలో వృద్...