మా ఓటు శాతం భారీగా పెరిగింది : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
తె లంగాణ లోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బైంసా, నారాయణపేట్ లలో బీజేపీ జెండా ఎగురువేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బైంసాలో తమ కార్యకర్తలను వేధించి, వందలు కేసులు పెట్టి జైలుకు పంపారని, అయినా ఇక్కడ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. దీనిలో భాగంగా బైంసా ప్రజలకు రాంచందర్రావు ధన్యవాదాలు తెలియజేశారు. మా ఓటు శాతం భారీగా పెరిగింది. 25 మునిసిపాలిటీలలో డిసైడింగ్ పార్టీ గా ఉన్నాం. చాలా ప్రాంతాల్లో వైస్ చైర్మన్గా గెలుస్తున్నాం. చాలా మున్సిపాలిటీల్లో సింగిల్ లార్టెస్ట్ పార్టీగా ఉన్నాం. ప్రతి చోటా మా ప్రాతినిధ్యం పెరిగింది మా పార్టీ బేస్ పెరిగింది. బీఆర్ఎస్ 43 నుంచి 27కు పడిపోయింది. 14 శాతం తగ్గింది. 550 వార్డులు నష్టపోయింది బీఆర్ఎస్. 70 గెలిచినా 2003తో పోలిస్తే కాంగ్రెస్కు చాలా తక్కువ స్థానాలు వచ్చాయి. రూలింగ్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. తెలంగాణ హిస్టరీలో మొదటి సారి మునిసిపల్ కార్పొరేషన్ను బీజేపీ గెలుచుకుంది. తెలంగాణ ప్రజలకు, బండి సంజయ్ కి ధన్యవాదాలు తెలిపుతున్న. ఎలాంటి పొత్తు లేకుండా మా సొంతంగా కరీంనగర్ మేయర్ స్థానాన్ని గెల...