Posts

Showing posts with the label Mohan Bhagwat says it is unfortunate that hate crimes are taking place

డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన విద్యార్థిపై జరిగిన దాడి : విద్వేషపూరిత దాడులు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్న మోహన్ భాగవత్

Image
ఛ త్తీస్‌గఢ్‌లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రసంగిస్తూ మోహన్ భాగవత్ సమాజంలో విద్వేషపూరిత దాడులు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. డెహ్రాడూన్‌లో త్రిపుర రాష్ట్రానికి చెందిన ఏంజల్ చక్మా అనే విద్యార్థిపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ భారతీయులందరూ ఒక్కటేనని, భారతదేశం అనేది ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరిదని, కులమతాలు, భాష లేదా ప్రాంతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేసి చూడకూడదని ఆయన పిలుపునిచ్చారు. మనుషుల మధ్య విభజన రేఖలు గీసే ఆలోచనలను మానుకోవాలని, అందరూ సమానత్వంతో మెలిగినప్పుడే దేశం బలోపేతం అవుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏంజల్ చక్మా మృతి పట్ల భాగవత్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాదని, సామాజిక సామరస్యానికి ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు మన కుటుంబ సభ్యులేనని, వారి పట్ల వివక్ష చూపడం ఆమోదయోగ్యం కాదని ఆయన హితవు పలికారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి పౌరుడిపై ఉందని ఆ...