Posts

Showing posts with the label Missed the CM Post Three Times

మూడుసార్లు సీఎం పదవి తప్పిపోయింది !

Image
క ర్ణాటకలోని తుమకూరులో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావాలనే తన చిరకాల కోరిక ఇంకా అలాగే ఉందని ఉద్వేగానికి గురయ్యారు. నాకు గతంలో 3 సార్లు సీఎం పదవి తప్పిపోయింది అని కొత్త వాపోయారు.  2013 ఎన్నికల్లో పార్టీ గెలిచినా, తాను ఓడిపోవడం వల్ల ముఖ్యమంత్రి పదవి తప్పిపోయిందని, ఆనాడు తాను గెలిచి ఉంటే సిద్ధరామయ్య సీఎం అయ్యేవారు కాదని తెలిపారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 80 స్థానాల్లో గెలుపొందినా మైత్రి సర్కార్‌ కారణంగా హెచ్‌డీ కుమారస్వామి సీఎం అయ్యారన్నారు. ఈసారి కూడా సీఎం పదవి తనకు రావాల్సి ఉన్నా, వివిధ రాజకీయ కారణాల వల్ల సాధ్యపడలేదని అన్నారు.