Posts

Showing posts with the label Miscreants steal silver ornaments worth Rs. 50 lakhs

కేపీహెచ్బీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీ !

Image
హై దరాబాద్ లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లోని మూలవిరాట్ కు సంబంధించిన ఆభరణాలు చోరీకి గురైయ్యాయి. సుమారు రూ.50 లక్షలకు పైగా విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుడిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు గుర్తించారు. తెల్లవారుజామున రోజు వారిలానే ఆలయాన్ని తెరిచి పూజ చేసే క్రమంలో పూజారులు గుర్తించారు.  వెంటనే ఆలయ నిర్వాహకులు కేపి.హెచ్.బి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఘటన పైన కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.