జనవరి 4న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్ రన్
ఆం ధ్రప్రదేశ్ లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు దాదాపు పూర్తికావడంతో, అధికారులు కీలకమైన ట్రయల్ రన్కు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా జనవరి 4న భోగాపురం ఎయిర్పోర్టులో తొలి కమర్షియల్ ఫ్లైట్ దిగనుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, ఎంపీ అప్పలనాయుడు ఢిల్లీ నుంచి ఈ తొలి విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్కు రానున్నారు. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి, అంతర్జాతీయ విమాన సేవలకు కీలక కేంద్రంగా మారనుంది. మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా సాగాయి. ప్రస్తుతం 95 శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం 5 శాతం పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను జూన్ నాటికి పూర్తి చేసి, ఆగస్టు నెలలో విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్త...