Posts

Showing posts with the label Malkajgiri Theft Case

మల్కాజిగిరి చోరీ కేసు : మరో నలుగురు నేపాలీ గ్యాంగ్ సభ్యుల అరెస్ట్‌

Image
తె లంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మల్కాజిగిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో మల్కాజిగిరి పరిధిలోని రిటైర్డ్ ప్రొఫెసర్ నివాసంలో నేపాలీ ముఠా భారీ చోరీకి తెగబడింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు కీలక సూత్రధారులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో నలుగురిని పుణెలో అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురు సభ్యులు పోలీసు కస్టడీలో ఉన్నారు. వీరిని పుణె నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు మల్కాజిగిరి పోలీసులు తెలిపారు. రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో రాత్రి సమయంలో చొరబడిన నేపాలీ గ్యాంగ్ రూ.లక్షల విలువైన నగలు, నగదు, ఇతర వస్తువులను అపహరించింది. మల్కాజిగిరి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లు, సెల్‌ఫోన్ లొకేషన్ డేటా ఆధారంగా గ్యాంగ్‌ను ట్రాక్ చేశారు. నేపాలీ ముఠా దేశంలోని వివిధ నగరాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.