Posts

Showing posts with the label Kundli-Manesar-Palwal Expressway in the Nuh district of Haryana

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యూపీ పోలీసులు దుర్మరణం

Image
హ ర్యానాలోని నుహ్ జిల్లాలో కుండలి-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకువచ్చిన ఒక వాహనం అదుపుతప్పి, ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు. మంగళవారం తౌరు సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దులావత్ టోల్ ప్లాజా వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. యూపీలోని జలౌన్ జిల్లాలో పోస్టింగ్‌లో ఉన్న ఈ పోలీసులు మహేంద్ర స్కార్పియో వాహనంలో పల్వాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.