పౌరసత్వంపై సందేహం ఉంటే ఓటు హక్కు తొలగించవచ్చా? : ఈసీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
దేశ పౌరసత్వం అన్నది ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్న అంశమని, దానిపై స్పష్టత రాకుండా ఓటు హక్కును నిరాకరించడంపై ఉన్నత న్యాయస్థానం ఆరా తీసింది. దీనిపై దాఖలైన ఒక ప్రత్యేక వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చిలతో కూడిన ధర్మాసనం, ఈ ప్రక్రియలో అనుసరిస్తున్న నిబంధనలను వివరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ద్వివేది వాదనలు వినిపిస్తూ, పౌరసత్వానికి సంబంధించిన అంశాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన తర్వాతే ఈసీ తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అయితే, కేంద్రం నుంచి తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండానే, ప్రాథమిక ఆధారాల బట్టి ఓటరు పేరును తొలగించే వెసులుబాటు ఈసీకి ఉందని ఆయన వివరించారు. ఈ నిర్ణయం తీసుకునే క్రమంలో చట్టపరమైన నిబంధనలను పాటిస్తామని, ఒకవేళ పేరు తొలగింపునకు గురైన వ్యక్తికి అభ్యంతరాలు ఉంటే అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని, కేవలం ఒక వ్యక్తి లేదా కొందరి పౌరసత్వ వివాదాల కోసం మొత్తం ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడం సాధ్యం కాదని...