Posts

Showing posts with the label Israeli Foreign Minister Gideon Sa'ar's tweet

ఆస్ట్రేలియాను ముందే హెచ్చరించాము : ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ట్వీట్‌

Image
ఆ స్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌ దాడి ఘటనపై ఇజ్రాయెల్‌ ఆరోపణలు చేసింది. ముందే హెచ్చరించినా ఆస్ట్రేలియా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యూదుల వేడుకలను టార్గెట్‌ చేసిన ఉ‍గ్రమూక దాడిలో 10 మంది మృతి చెందగా, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. యూదులపై దాడులు జరగవచ్చని ఆస్ట్రేలియాకు ముందే హెచ్చరికలు ఇచ్చామని, యాంటీ-సెమిటిజాన్ని అరికట్టడంలో చర్యలు తీసుకోలేదని ఇజ్రాయెల్‌ విమర్శించింది. ఈ సందర్భంగా సిడ్నీ కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ట్వీట్‌ చేశారు. సిడ్నీ కాల్పుల ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పటికైనా ఆస్ట్రేలియా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలి'అని పేర్కొన్నారు. మరోవైపు, సిడ్నీ ఉగ్రదాడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ తీవ్రంగా ఖండించారు. యూదులపై అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా అధికారులు యాంటీ-సెమిటిజాన్ని ఎదుర్కోవడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మన సోదరులు, సోదరీమణులు.. ఉగ్రవాదుల చేతిలో అత్యంత క్రూరమైన దాడికి గురయ్యారు' అంటూ హెర్జోగ్ యెరూషలేములో జరిగిన ఒక కార్యక్రమంలో ...