ఉత్తరాఖండ్లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలు : వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన బాలుడు
ఉ త్తరాఖండ్లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు ఆడుకుంటూ ఉన్న ఆరేళ్ల చిన్నారి క్షణాల్లోనే వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ సంఘటన వర్షాకాలంలో మురుగునీటి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థల భద్రతపై మరోసారి తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. వికాస్నగర్లోని ఖాదర్ నివాస ప్రాంతంలో శనివారం భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఆరేళ్ల అర్మాన్ రోడ్డు పక్కన ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించిన వర్షపు నీరు అతడిని సమీపంలోని మురుగు కాలువ వైపు లాక్కెళ్లింది. బలమైన ప్రవాహాన్ని తట్టుకోలేక బాలుడు నేరుగా సుమారు 10 అంగుళాల వెడల్పు ఉన్న డ్రైనేజీ పైపులోకి కొట్టుకుపోయాడు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. బాలుడు పైపులో చిక్కుకున్నాడని గుర్తించిన గ్రామస్తులు వెంటనే జేసీబీ యంత్రాన్ని తీసుకొచ్చి పైపును పగలగొట్టే ప్రయత్నం చేశారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆందోళన మరింత పెరిగింది. అందరూ ప్రాణాలతో బయటపడతాడని ఆశించినప్పటికీ, పైపును తొలగించి బాలుడిని బయటకు తీసే సమయానికి అతడు అప్పటికే స్పృహ కోల్...