పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై విండ్ఫాల్ పన్నును భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై విధించే విండ్ఫాల్ పన్నును భారీగా పెంచింది. పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం, డీజిల్ ఎగుమతులపై విండ్ఫాల్ పన్నును లీటరుకు రూ.8.50 నుంచి రూ.15.50కు పెంచారు. అలాగే, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పై విండ్ఫాల్ పన్నును లీటరుకు రూ.7.50 నుంచి రూ.14.50కు పెంచారు. ఈ కొత్త పన్ను రేట్లు జూలై 16 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, పెట్రోల్ ఎగుమతులపై విధించే విండ్ఫాల్ పన్నును లీటరుకు రూ.4 మేర తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విండ్ఫాల్ ట్యాక్స్ అనేది ప్రభుత్వం చమురు కంపెనీలపై లేదా ఎగుమతిదారులపై విధించే అదనపు పన్ను. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగినప్పుడు కంపెనీలకు అధిక లాభాలు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో దేశీయ మార్కెట్లో ఇంధన లభ్యతను కాపాడడం, అధిక లాభాలను నియంత్రించడం కోసం ప్రభుత్వం ఈ పన్నును విధిస్తుంది.