Posts

Showing posts with the label IMD Issues Orange Alert for 12 Districts

కేరళలో కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి : మరో 8 మంది గల్లంతు : 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎమ్‌డీ

Image
కే రళలో కురిసిన భారీ వర్షాలు, వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. శనివారం వీచిన వర్షాల ధాటికి సంభవించిన కొండచరియలు, జలదిగ్బంధం కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 8 మంది గల్లంతయ్యారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇళ్ల ధ్వంసం: రాష్ట్రవ్యాప్తంగా 27 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవ్వగా, 196 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బాధితుల కోసం ఏర్పాటు చేసిన 209 సహాయక శిబిరాల్లోకి 5,792 మందిని తరలించారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో శుభ్రపరిచే పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాల్లో రాజకీయ శ్రేణులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలని కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీసన్ పిలుపునిచ్చారు. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం కన్నూర్ జిల్లాలోని అయ్యన్‌కున్ను ప్రాంతంలో అత్యధికంగా 320 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉత్తర మలబార్ ప్రాంతంలో 90 మి.మీ నుంచి 180 మి.మీ వరకు భారీ వర్షం పడింది. పతనంథిట్ట, ఇడుక్కి, వయనాడ్, కొట్టాయం, కోజికోడ్, కన్నూర్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలతో పాటు స్థానిక జాలర్లు, పడవులను రంగంలోకి దించారు. ఐఎమ్‌డీ రాబోయే పరిస్...