Posts

Showing posts with the label He is currently serving as the SSP of Srinagar

ఉగ్రకుట్ర భగ్నం కేసులో మొదట లీడ్ ఇచ్చిన తెలుగు అధికారి సందీప్ చక్రవర్తి !

Image
జ మ్మూకశ్మీర్ ఉగ్ర కుట్ర భగ్నం కేసులో తెలుగు అధికారి సందీప్ చక్రవర్తి మొదట లీడ్ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీనగర్ ఎస్ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. పెహల్గాం ఎటాక్ తర్వాత చేపట్టిన మహాదేవ్ ఆపరేషన్ లోనూ కీలకంగా వ్యవహరించారు. జైషే మహమ్మద్ పోస్టర్లను మొదట గుర్తించారు. పోస్టర్లు అంటించిన వారిని సీసీ కెమెరాలు ద్వారా గుర్తించారు. ముగ్గురు నిందితులపై గతంలో స్టోన్ పెల్టింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. సోఫియాన్, ఇర్ఫాన్ అహ్మద్‌లను అరెస్టు చేసి రెండు వారాల పాటు విచారించారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే డాక్టర్ల టెర్రర్ ప్లాట్ బయటికి వచ్చింది. కాగా ప్రస్తుతం డాక్టర్స్ టెర్రర్ మాడ్యుల్ లో అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఫరీదాబాద్ తనిఖీల్లో 358 కేజీ పేలుడు పదార్థంతోపాటు 2563 కేజీల సామాగ్రిని స్వాధీనం జమ్మూకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు సంవత్సరాలుగా ఈ మెటీరియల్‌ను సమకూర్చినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి.