యాషెస్ సిరీస్ : ఇంగ్లాండ్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా
ఆ స్ట్రేలియా లోని బ్రిస్బేన్, గాబాలో జరిగిన రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదటి టెస్ట్ను కూడా ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 241 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ అత్యధికంగా 50 పరుగులు చేయగా, చివర్లో విల్ జాక్స్ 41 పరుగులు జోడించాడు. జాక్ క్రాలీ (44), ఓలీ పోప్ (26) మంచి ఆరంభాలు లభించినా, వాటిని పెద్ద ఇన్నింగ్స్లుగా మార్చలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు 177 పరుగుల ఆధిక్యం లభించింది. దీని కారణంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాకు కేవలం 65 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఇవ్వగలిగింది. ఆస్ట్రేలియా తరఫున రెండో ఇన్నింగ్స్లో మైఖేల్ నేసర్ 5 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ చెరో 2 వికెట్లు, బ్రెండన్ డాగెట్ ఒక వికెట్ పడగొట్టారు. 65 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 2 వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలోనే ఛేదించింది. స్టీవ్ స్మిత్ 9 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, ట్రావిస్ హెడ్ 22, జేక్ వెదర్రాల్డ్ ...