గెలాక్సీ ఎస్22 ప్రీ బుకింగ్స్ ప్రారంభం
సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీబుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. గెలాక్సీ అక్ప్యాక్డ్ 2022 ఈవెంట్లో సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్22 సిరీస్లో భాగంగా సామ్సంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్21 సిరీస్కు కొనసాగింపుగా లాంచ్ అయిన సిరీస్ ఇది. గత సంవత్సరం గెలాక్సీ ఎస్21 ను సామ్సంగ్ రిలీజ్ చేసింది. ఇందులో ఎస్22 అల్ట్రా ఫోన్ను ఎస్ పెన్ ఆప్షన్తో రానుంది. గెలాక్సీ నోట్ సిరీస్లో సపరేట్గా పెన్ ఆప్షన్ ఇందులో ఉంటుంది. సామ్సంగ్ ఇండియా సైట్లో సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రూ.1,999 కట్టి ఫోన్ను బుక్ చేసుకోవచ్చు. ఇండియాలో సామ్సంగ్ సేల్స్ ప్రారంభం కాగానే.. ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్లకు ముందుగా ఫోన్ కొనుగోలు చేసే చాన్స్ ఉంటుంది. ప్రీబుకింగ్ సమయంలో పే చేసిన రూ.1999ను ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత రిఫండ్ చేస్తారు. ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 21 వరకు ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్స్ చేసుకున్న కస్టమర్లకు రూ.2699 విలువైన సామ్సంగ్ ...