ప్రైమరీ టార్గెట్ హెల్త్కేర్ ఇండస్ట్రీ !
దేశంలో ఇటీవల కాలంలో సైబర్ దాడులు పెరిగాయి. ఆన్లైన్ మోసాలకు సంబంధించిన కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. 2021తో పోలిస్తే 2022లో గ్లోబల్ సైబర్ ఎటాక్స్ 38 శాతం పెరిగాయి. ఇటీవల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వర్లపై రాన్సమ్వేర్ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం దేశంలో జరిగిన అతి పెద్ద సైబర్ దాడిగా దీన్ని పేర్కొనవచ్చు. దేశంలో హెల్త్కేర్ ఇండస్ట్రీ లక్ష్యంగా హ్యాకర్లు ఎక్కువగా దాడులు జరిగినట్లు ఓ నివేదిక పేర్కొంది. 2022లో అత్యధికంగా దాడికి గురైన పరిశ్రమల పరంగా హెల్త్కేర్, దాని తర్వాత వరుసగా రెండు, మూడు స్థానాల్లో విద్య/పరిశోధన, ప్రభుత్వం/మిలిటరీ ఉన్నాయి. నాలుగో త్రైమాసికంలో గ్లోబల్ సైబర్టాక్స్ సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుందని నివేదికలు వెల్లడించాయి. ఒక్కో సంస్థపై సగటున వారానికి 1168 దాడులు జరిగాయి. చెక్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఈ సైబర్ ఎటాక్స్ చిన్న, చురుకైన హ్యాకర్లు, రాన్సమ్వేర్ గ్యాంగ్ల ద్వారా జరిగాయి. సైబర్ నేరగాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్విరాన్మెంట్లో ఉపయోగించే డివైజ్లపై దృష్టి సారించినట్లు నివేదిక పేర్కొంది. కోవిడ్-19 తర్వాత ఆ...