Posts

Showing posts with the label నేటి నుంచి పల్లె పండుగ

15వ ఆర్దిక సంఘం నిధుల కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.988.77 విడుదల ?

Image
ఆం ధ్రప్రదేశ్ కి కేంద్రం 15వ ఆర్దిక సంఘం నిధుల కింద రూ.988.77  విడుదల చేసింది. ఇదే సమయంలో నేటి నుంచి ప్రభుత్వం పల్లె పండుగ పేరుతో పంచాయతీ వారోత్సవాల నిర్వహిస్తుంది. అయిదేళ్లు తరువాత మూడు వేల కి.మీ. సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు  కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భూమిపూజ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ దీనికి సంబంధించి ప్రణాళికా బద్దంగా వెళ్లాలని అధికారులకు నిర్దేశించారు. కేంద్రం నుంచి ఆర్దిక సంఘం నిధులు రూ 988.77 కోట్లు విడుదల అయ్యాయి. అందులో అందులో అన్‌టైడ్‌ గ్రాంట్లు రూ.395.50 కోట్లు, టైడ్‌ గ్రాంట్లు రూ.593.26 కోట్లు ఉన్నాయి. వీటిని రాష్ట్రంలో ఎంపిక చేసిన 9 జిల్లా పరిషత్‌లు, 615 మండల పరిషత్‌లు, 12,853 గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. పంచాయతీల్లో సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు వీటిని ఉపయోగించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. నేటి నుంచి ప్రారంభం కానున్న 'పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల'కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ...