Posts

Showing posts with the label క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో పది లక్షల పైగా ఉద్యోగాల కల్పన ?

2030 నాటికి జనరేటివ్‌ ఏఐ, డీప్‌ టెక్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో పది లక్షల పైగా ఉద్యోగాల కల్పన ?

Image
2030 నాటికి జనరేటివ్‌ ఏఐ, డీప్‌ టెక్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ మొదలైన కొత్త టెక్నాలజీలతో పది లక్షల పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది. బిజినెస్‌ సర్వీసుల సంస్థ క్వెస్‌ కార్ప్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ విభాగం కార్యకలాపాల ఆధారంగా దీన్ని రూపొందించారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), సైబర్‌సెక్యూరిటీ విభాగాల్లో రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) నిపుణులైన సిబ్బందికి డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన క్రితం త్రైమాసికంతో పోలిస్తే జీసీసీలో 71 శాతం, సైబర్‌సెక్యూరిటీలో 58 శాతం మేర ఉద్యోగావకాశాలు పెరిగాయి. దేశీయంగా వచ్చే 6 నెలల్లో ఐటీ సర్వీసుల్లో హైరింగ్‌ 10-12 శాతం పెరగవచ్చని క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ సీఈవో కపిల్‌ జోషి తెలిపారు. నివేదిక ప్రకారం రెండో త్రైమాసికానికి సంబంధించి హైరింగ్‌ డిమాండ్‌లో 79 శాతం వాటా .. ఈఆర్‌పీ, టెస్టింగ్, నెట్‌వర్కింగ్, డెవలప్‌మెంట్, డేటా సైన్స్‌ వంటి అయిదు నైపుణ్యాలది ఉంది. వీటికి తోడు జావా (30 శాతం), సైబర్‌సెక్యూరిటీ (20 శాతం), డెవ్‌...