దేశీయ మార్కెట్లో జీబ్రానిక్స్ ల్యాప్ టాప్ లు !
జీ బ్రానిక్స్ ల్యాప్ టాప్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఒకేసారి ఏకంగా ఐదు ల్యాప్ టాప్ లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. జీబ్రానిక్స్ ప్రో సిరీస్ వై, ప్రో సిరీస్ జెడ్ పేరిట మొత్తం ఐదు ల్యాప్ టాప్ లను ఒకేసారి ఆవిష్కరించింది. ప్రో సిరీస్ జెడ్ ల్యాప్ టాప్ లో ఓ కొత్త మైల్ స్టోన్ వంటి ఫీచర్ ను జీబ్రానిక్స్ ప్రవేశపెట్టింది. దేశంలో మొట్టమొదటి సారిగా ఓ ల్యాప్ టాప్ లో డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ ను ఆవిష్కరించింది. ఈ ప్రో సిరీస్ జెడ్ ల్యాప్ టాప్ లలో ఈ ఫీచర్ మంచి సౌండ్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది. జీబ్రానిక్స్ ప్రో సిరీస్ జెడ్ ల్యాప్ టాప్ ప్రీమియం బలమైన మెటల్ బాడీ ఎన్క్లోజర్ను కలిగి ఉంటాయి. 15.6-అంగుళాల డిస్ప్లే 1080 పిక్సల్స్ రిజల్యూషన్లో పూర్తి హై-డెఫినిషన్ లో వైబ్రెంట్ విజువల్స్ను అందిస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్పై ఆధారపడి పనిచేస్తుంది. వేగవంతమైన, సమర్థవంతమైన ఇంటెల్ ప్రాసెసర్లతో దీనిలో ఉంటాయి. 16జీబీ వరకూ ర్యామ్, 1టీబీ వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ. 27, 990 నుంచి ఉంటాయి. టైప్-సీ పోర్ట్లు, వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్డీఎంఐ, మైక్ర...