ఆసియా క్రీడల్లో నీలం రంగు జెర్సీతో బరిలోకి దిగనున్న భారత పురుషుల, మహిళల జట్లు

ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్‌కప్‌ ముందు నీలం రంగు స్థానంలో కాషాయంను ప్రవేశపెట్టడంపై విమర్శలు రాగా ఆ టోర్నీలో అదే జెర్సీతో ఆడిన టీమిండియా నిరాశపరిచింది. దాంతో రాబోయే టోర్నమెంట్లలో మునపటి బ్లూ కలర్‌నే కొనసాగించాలని భారత జట్టు నిర్ణయించుకుందని సమాచారం. త్వరలో జరుగనున్న 20వ ఆసియా క్రీడల్లో హర్మన్‌ప్రీత్ సింగ్, సలీమా టెటె సారథ్యంలోని జట్లు తమకు అచ్చొచ్చిన నీలంతోనే బరిలోకి దిగనుందని హాకీ ఇండియా వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టులో జరిగిన ఎఫ్‌ఐహెచ్ పురుషుల, మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో ఆరెంజ్ జెర్సీతో ఆడిన టీమిండియా.. ఈసారి సంప్రదాయ నీలం రంగుకే ఓటేయనుంది. జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో నీలం రంగు జెర్సీతోనే భారత పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయని సమాచారం. ఈ మెగా ఈవెంట్‌లో తొలి ప్రధాన్య కిట్‌ రంగుగా నీలం ఉండనుందని హాకీ ఇండియా తెలిపింది.

Comments