బడ్జెట్ డిజిటల్ రంగానికి ప్రోత్సాహం !
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవల స్వీకరణను పెంచేందుకు, దేశంలో మొత్తం 75 డిజిటల్ బ్యాంకులను ప్రారంభిస్తున్నట్లు మరియు ఇ-పాస్పోర్ట్లు, ఎంబెడెడ్ చిప్స్ మరియు ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలతో ప్యాక్ చేయబడతాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలోని ప్రతి పౌరుడిని "డిజిటల్ బ్యాంకింగ్" విధానంవైపు తీసుకెళ్లే లక్ష్యంతో దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్ విధానం వైపు అడుగులు వేయడానికి అదనంగా పోస్టాఫీసులు మరియు బ్యాంకు అకౌంటుల మధ్య ఆన్లైన్ బదిలీని అనుమతించే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్లో 100 శాతం పోస్టాఫీసులు వస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. అన్ని పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం చేసినట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా 1.5 లక్షల పోస్టాఫీసులను ఆన్లైన్ విధానంతో అనుసంధానం చేయనున్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించేందుకు "దేశ్ స్టాక్ ఇ-పోర్టల్" ప్రారంభించబడుతుందని ఆమె చెప్పారు. ఆర్బిఐ డిజిటల్ కరెన్సీప...