ఎన్ఐసీఈ రోడ్ కారిడార్‌పై టోల్ చెల్లించవద్దు : బెంగళూరు ప్రజలకు కేంద్ర మంత్రి కుమారస్వామి పిలుపు

Telugu Lo Computer
0

న్ఐసీఈ రోడ్ కారిడార్‌పై టోల్ చెల్లించవద్దని బెంగళూరు ప్రజలకు కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి పిలుపునిచ్చారు. టోల్ పేరుతో ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వ చర్యను ఆయన ఖండించారు. నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజెస్ రోడ్డుపై టోల్ వసూళ్లను 10 రోజుల్లో గడువు కూడా ఆయన విధించారు. ఈ ప్రాజెక్టులో అక్రమాలు, మోసాలు జరిగాయని ఆయన ఆరోపించారు. బెంగళూరు-మైసూరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టుపై కర్ణాటక హైకోర్టు చేసిన ఇటీవలి వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్ఐసీఈ ప్రాజెక్టును తన ఆధీనంలోకి తీసుకుని టోల్ వసూళ్లను నిలిపివేయాలని కోరారు. "ఎన్ఐసీఈ రోడ్డుపై టోల్ చెల్లించడం మానేయాలని బెంగళూరు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. టోల్ పేరుతో ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వ చర్యను అడ్డుకోవాలని మేము నిర్ణయించుకున్నాము. దీని కోసం మేము వారం లేదా 10 రోజుల గడువు ఇస్తున్నాము," అని కుమారస్వామి చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తాలని జేడీ (ఎస్), బీజేపీ సభ్యులను కోరినట్లు ఆయన తెలిపారు. ఏఐ ఆధారిత బిదాడి టౌన్‌షిప్ ప్రాజెక్టును కూడా వ్యతిరేకించాలని పార్టీ నిర్ణయించిందని ఆయన చెప్పారు. బీఎంఐసీ ప్రాజెక్టు రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణాలలో ఒకటిగా కనిపిస్తోందని హైకోర్టు అభిప్రాయపడిందని గుర్తు చేశారు. కోర్టు తీర్పు దృష్ట్యా, వాహనదారులు ఆ రోడ్డుపై టోల్ చెల్లించకూడదని కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి హైకోర్టు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. ప్రాజెక్టు అమలులో తీవ్రమైన అక్రమాలు జరిగాయని కోర్టు ఎత్తిచూపిందన్నారు.వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్న విధానాన్ని ప్రశ్నించిందన్నారు. ఈ ప్రాజెక్టు అవినీతిపై నిపుణుల బృందంతో స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రాజెక్ట్ ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడంపై ప్రశ్నించిన కుమారస్వామి, కోర్టు వ్యాఖ్యలకు ప్రభుత్వం స్పందించాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. దేశవ్యాప్తంగా టోల్ ధరలు పెంచినప్పుడు ఏ ఒక్క బీజేపీ నాయకుడూ నిరసన తెలపలేదని అన్నారు. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మెట్రో ఛార్జీని ఒక్క రూపాయి పెంచినా, బీజేపీ మొత్తం వచ్చి నిరసన తెలుపుతుందని గుర్తు చేశారు. కానీ టోల్ ధరలు పెంచారు కదా, దానికి ఎవరు బాధ్యులని ఆయన ప్రశ్నించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default