ముగిసిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి గడువు : నేటి నుంచి ప్రత్యేక అధికారి పాలన

Telugu Lo Computer
0


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలక మండలి గడువు నేటితో ముగియనుంది. దీంతో నేటి సాయంత్రం నుంచే జీహెచ్‌ఎంసీ పగ్గాలను ప్రత్యేక అధికారి చేపట్టనున్నారు. హైదరాబాద్ నగరాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్‌లుగా విభజించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి రానుంది. దీనికి సంబంధించి రేపు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. విభజన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా మారనున్నది. కొత్తగా ఏర్పడనున్న మూడు కార్పొరేషన్‌లకు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చింది. మే 15 నుంచి 20వ తేదీ మధ్యలో ఈ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయి, జూన్ మొదటి వారంలో నూతన పాలకవర్గాలు కొలువుదీరే అవకాశం ఉంది. నగర విస్తీర్ణం పెరగడం, జనాభా ప్రాతిపదికన ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విభజన ప్రక్రియను చేపడుతోంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default