సబ్‌మెరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

Telugu Lo Computer
0


స్టెల్తీ సబ్‌మెరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణిను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష బంగాళాఖాతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరీక్ష అణ్వాయుధాలను మోసుకెళ్లగల K-4 క్షిపణిని అరిహంత్-శ్రేణి జలాంతర్గామి నుండి ప్రయోగించారు. ఈ పరీక్ష గురించి ముందస్తు ప్రకటన చేయలేదు. ఈ ప్రాంతంలో చైనా నిఘా నౌకలు ఉన్నందున గోప్యతకు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. ఈ పరీక్ష భారత్ సముద్ర ఆధారిత అణు త్రయాన్ని బలోపేతం చేస్తుంది, రెండవ దాడి సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది.  ఈ K-4 క్షిపణి అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇది డీఆర్డీఏచే అభివృద్ధి చేయబడిన స్వదేశీ K-సిరీస్ క్షిపణి. ఈ క్షిపణి ప్రత్యేకంగా అరిహంత్-తరగతి అణు జలాంతర్గాముల కోసం రూపొందించారు. ఈ క్షిపణి దాదాపు 3,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. దీని పొడవు సుమారు 12 మీటర్లు. దాని వ్యాసం 1.3 మీటర్లు. ఈ క్షిపణి బరువు 17-20 టన్నులు, 2 టన్నుల వరకు పేలోడ్ కలిగి ఉంటుంది. ఇది నీటి అడుగున ప్రయోగించగల సామర్థ్యం (కోల్డ్ లాంచ్ సిస్టమ్), 3D యుక్తి, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థల నుండి తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default