కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో పర్యావరణహితమైన, తక్కువ ఖర్చుతో కూడిన సరుకు రవాణాను ప్రోత్సహించడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికలను ప్రకటించారు. తూర్పు భారతదేశంలోని దన్కుణి (పశ్చిమ బెంగాల్) నుండి పశ్చిమ తీరంలోని సూరత్ (గుజరాత్) వరకు కొత్తగా 'డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్' ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ కారిడార్ ద్వారా పారిశ్రామిక కేంద్రాల మధ్య సరుకు రవాణా వేగవంతం కావడమే కాకుండా, లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 20 కొత్త జలమార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా మొదటగా ఒడిశాలోని నేషనల్ వాటర్వే-5ను అభివృద్ధి చేయనున్నారు. ఇది ఖనిజ సంపద అధికంగా ఉండే తాల్చేర్, అంగుల్ ప్రాంతాలను కళింగనగర్ వంటి పారిశ్రామిక కేంద్రాలతో పారాదీప్, ధమ్రా ఓడరేవులతో అనుసంధానిస్తుంది. వీటితో పాటు, అంతర్గత జలమార్గాల్లో తిరిగే నౌకల కోసం వారణాసి, పాట్నాల్లో అత్యాధునిక 'షిప్ రిపేర్ ఎకోసిస్టమ్' ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
కొత్తగా 'డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్' ఏర్పాటు !
February 01, 2026
0
Tags