డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. డిసెంబర్ 2025లో జరిగిమ మొత్తం యూపీఐ లావాదేవీలు 21.6 బిలియన్లు. వీటి విలువ రూ.27.97 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే లావాదేవీలు 29 శాతం పెరిగింది. ఇప్పటి వరకు నమోదైనవాటిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. నవంబర్లో జరిగిన లావాదేవీలు 20.47 బిలియన్లు.
డిసెంబర్ లో 29 శాతం పెరిగిన యూపీఐ లావాదేవీలు
January 01, 2026
0
Tags