రీఫండ్‌లను సాధ్యమైనంత వేగంగా అందించేలా చర్యలు : క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ ను ఏర్పాటు చేసిన ఇండిగో

Telugu Lo Computer
0


ద్దైన విమానాలకు సంబంధించిన రీఫండ్‌లను సాధ్యమైనంత వేగంగా ప్రయాణికులకు అందించేలా చర్యలు చేపడతామని ఇండిగో వెల్లడించింది. సంక్షోభంపై చర్చించేందుకు సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ప్రత్యేకంగా సమావేశమైనట్లు ఇండిగో ప్రకటించింది. సమస్యకు దారితీసిన అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు తెలిపింది. సీఈఓ, ఇతర బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. సంక్షోభం నుంచి త్వరితగతిన బయటపడటానికి, ఇండిగో విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ పనిచేస్తుందని సంస్థ తెలిపింది. అలాగే ఈ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేస్తున్నట్లు వెల్లడించింది. రద్దయిన విమానాల రీఫండ్‌లు, రీషెడ్యూలింగ్‌పై మినహాయింపులు ఇచ్చేందుకు బోర్డు సభ్యులు కృషి కొనసాగిస్తున్నారని ఇండిగో ప్రకటించింది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default