భారతదేశ దీర్ఘకాలిక వృద్ధికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఇండియా డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజిక్ ఫండ్ ను స్థాపించాలని ప్రతిపాదించింది. ఇది దేశ వృద్ధిని, ప్రపంచ ఆర్థిక ప్రభావాన్ని లక్ష్యంగా చేసుకుని స్వాతంత్ర్య శతాబ్ది సంవత్సరం (2047) నాటికి 1.3 నుంచి 2.6 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.108 నుంచి రూ.216 లక్షల కోట్ల కార్పస్ను ఏర్పాటు చేయాలని ఈ ఫండ్ లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ అవసరాలకు అనుగుణంగా ఇండియా డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజిక్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని సీఐఐ భావిస్తోంది. దీనిద్వారా మౌలిక సదుపాయాలు, తయారీ, ఆవిష్కరణలకు మూలధనాన్ని అందించనున్నారు. ఇంధనం, ఖనిజాలు, సాంకేతిక విజ్ఞానం వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ద్వారా విదేశాల్లో భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించనున్నారు. ఇప్పటికే ఉన్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ను బేస్గా ఉపయోగించుకుని ప్రతిపాదిత ఐడీఎస్ఎఫ్ను మెరుగైన పాలనకు వెచ్చించనున్నారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి సీఐఐ వినూత్న నిధుల వనరులను ప్రతిపాదించింది. రోడ్లు, ఓడరేవులు, స్పెక్ట్రమ్ వంటి ప్రజా మౌలిక సదుపాయాల ఆస్తుల విక్రయం ద్వారా నిధులను సమీకరించనున్నారు. ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఈక్విటీని ఫండ్కు బదిలీ చేస్తారు. దీర్ఘకాలిక సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ప్రపంచ పెట్టుబడిని ఆకర్షించనున్నారు.
భారతదేశ దీర్ఘకాలిక వృద్ధికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి సీఐఐ ఫండ్ ప్రతిపాదన
November 10, 2025
0
Tags