ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రూ.99 ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిళ్లను మినహాయించి మిగిలిన అన్ని రకాల మద్యం ఉత్పత్తులపై ఒక్కో బాటిల్కు రూ.10 చొప్పున ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్, బీర్, వైన్ వంటి అన్ని విభాగాల మద్యం ఉత్పత్తులు ఉన్నాయి. రూ.99 ధర ఉన్న బీర్, వైన్ బాటిళ్లకు మాత్రం ఈ పెంపు వర్తించదని సర్కారు స్పష్టం చేసింది. అంతే కాకుండా ఇదే సమయంలో మద్యం విక్రయాల్లో రిటైలర్లకు ఇచ్చే మార్జిన్ను కూడా ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ తో పాటు రూ.99 ఎంఆర్పీ ఉన్న బీర్, వైన్ బాటిళ్లపై రిటైలర్ మార్జిన్ను 1 శాతం పెంచాలని నిర్ణయించింది. మద్యం ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
మద్యం ధరలను పెంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
January 12, 2026
0
Tags