ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని మెడికల్ కాలేజీకి పీపీపీ మోడ్లో కిమ్స్ టెండర్ వేసినట్టు ప్రచారం జరిగింది. అయితే అది అవాస్తమని, తాము ఎలాంటి టెండర్లో పాల్గొనలేదని కిమ్స్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఇదే విషయంపై మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ ఆదోని మెడికల్ కాలేజీకి డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తిపేరు మీద టెండర్ వచ్చిందని అతను కిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్గా చేస్తున్నారని అందువల్ల కిమ్స్ నుంచి టెండర్ వచ్చిందని తాము భావించామని వెల్లడించారు.
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేయలేదు : కిమ్స్ యాజమాన్యం
December 26, 2025
0
Tags