పారా ఒలింపిక్స్‌లో ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు !

Telugu Lo Computer
0


పారా ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన ఇరాన్ పారా అథ్లెట్‌పై అనర్హత వేటు పడడంతో రజతం గెలిచిన భారత అథ్లెట్‌కి గోల్డ్ మెడల్ దక్కింది. మెన్స్ జావెలిన్ త్రో F41 (మరుగుజ్జు) ఈవెంట్‌లో ఇరాన్ పారా అథ్లెట్ సజ్దేగ్ సయాహ్ బెయిట్, 47.64 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచాడు. అయితే స్వర్ణం గెలిచిన తర్వాత తీవ్రవాదుల జెండా చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. జిహాద్‌కి అనుకూలంగా వ్యాఖ్యలు ఉన్న జెండాను చూపించడంతో అతనిపై అనర్హత వేటు పడింది. విశ్వ క్రీడల వేదికలపై రాజకీయాలకు, మతాలకు సంబంధించిన స్లోగన్స్ చూపించడం చట్ట విరుద్ధం. అందులోనూ తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా చేసే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తారు. అప్పటికే టెక్నికల్ మిస్టేక్‌ కారణంగా ఎల్లో కార్డు పొందిన సజ్దేగ్ సయాహ్ బెయిట్‌పై అనర్హత వేటు పడింది. దీంతో ఇదే ఈవెంట్‌లో 47.32 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచిన భారత పారా అథ్లెట్ నవ్‌దీప్ సింగ్‌కి స్వర్ణం దక్కనుంది. సజ్దేగ్ సయాహ్‌ తనపై పడిన అనర్హత వేటుపై అప్పీలు చేశాడు. అయితే ఈ అప్పీల్‌ని పారా ఒలింపిక్ కమిటీ తోసిపుచ్చింది. దీంతో భారత్ ఖాతాలో 7వ స్వర్ణం చేరింది. ఇప్పటిదాకా 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు గెలిచిన భారత్, ప్రస్తుతం 16వ స్థానంలో ఉంది. పారా ఒలింపిక్స్‌లో భారత్‌కి ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default