సెట్స్పైకి 'దృశ్యం 4' చిత్రం
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దృశ్యం' మూవీకి ఇప్పటికే మూడు సీక్వెల్స్లు వచ్చాయి. 'దృశ్యం 3' మూవీ సమయంలోనే ఇంకా లాగకండి అంటూ విమర్శలు వచ్చాయి. అయితే జీతూ జోసెఫ్ 'దృశ్యం 4' మూవీని త్వరలోనే సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నాడు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్, మీనా, ఎస్తర్ అనిల్, అన్సిబా హసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'దృశ్యం' మూవీ, 2013లో వచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. కూతురు, భార్య కలిసి అనుకోకుండా చేసిన హత్యను కప్పిపుచ్చడానికి జార్జ్ కుట్టి వేసే ఎత్తులు, పైఎత్తులే 'దృశ్యం' కథ. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని తెలుగులో వెంకటేశ్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగణ్, కన్నడలో వీ. రవిచంద్రన్ రీమేక్ చేశారు. సింహళ, చైనీస్, ఇండోనేషియన్ భాషల్లో కూడా రీమేక్ అయ్యింది. దాదాపు అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన 'దృశ్యం 2' మూవీ కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ ఫ్రాంఛైజీలో మూడో భాగం 'దృశ్యం 3' మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా బాక్సాఫీస్ దగ్గర రూ.242 కోట్లు వసూలు చేసి, బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అందుకే ఈ ఫ్రాంఛైజీని ఆపకూడదని 'దృశ్యం' మూవీ ఫ్రాంఛైజీ మేకర్స్ భావిస్తున్నారట. 'దృశ్యం 4' ఉంటుందని ఈ ఫ్రాంఛైజీ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ ప్రకటించాడు.