రిక్షాలో వెళ్తూ నటి అభినయ తల్లి కన్నుమూత !
తమిళనాడుకు చెందిన నటి అభినయ పుట్టుకతోనే మాట్లాడలేదు.ఆమెకు వినపడదు. అయినా కూడా తన నటనతో సినిమాల్లో రాణిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించారు. ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు అభినయ. శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, నేనింతే, కింగ్, రాజుగారి గది 2 వంటి సినిమాల్లో నటించారు. అయితే రిక్షాలో ప్రయాణిస్తూ ఊహించని విధంగా మరణించారు. ఈ విషయాన్ని అభినయం ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. అమ్మ నువ్వు లేవనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. మీరు ఆకస్మాత్తుగా మిమ్మల్ని వదిలేసి ఈ లోకాన్ని విడిచివెళ్లిపోతారనుకోలేదు. తాతలానే నువ్వు కూడా ఇలా రిక్షాలోనే మరణించారు. తండ్రి కూతురు ఇద్దరు ఇలా ఒకేలా మరణించడం ఎంత యాధృచ్చికమో కదా. నువ్వు లేకుంటే నేను ఇంత సాధించేదాన్ని కాదు కదా. ప్రతి విషయంలోనూ నన్ను ముందుండి నడిపించారు. ఇప్పుడు నీ బాధ్యతను సాయిసునందన్ తీసుకుంటాడు. జన్మ ఉంటే మళ్లీ నీ కూతురుగానే పుట్టాలని కోరుకుంటున్నాను అమ్మ. రెస్ట్ ఫరెవర్ అమ్మ అంటూ భావోద్వేగంతో రాసారు అభినయ.