ఎర్రకోటలో తొలిసారిగా పూర్తి వందేమాతరం గేయం ఆలాపన
దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబారాన్ని అంటాయి. ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. ఇదే సమయంలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. దేశ చరిత్రలో ఎర్రకోటపై వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించడం ఇదే ప్రథమం. అనంతరం జాతీయ గీతం 'జన గణ మన'ను ఆలపించారు. ఆ సమయంలో భారత వాయుసేన పూలవర్షం కురిపించింది. ఒక హెలికాప్టర్ జాతీయ జెండాను.. మరొకటి 'వందేమాతరం' అని రాసి ఉన్న పతకాన్ని తీసుకెళ్లి ఆకాశంలో కనువిందు చేశాయి.