పాలిటెక్నిక్ విద్యార్థులపై సీఐ దౌర్జన్యం : సీఐ రఘపతి రెడ్డిపై సమగ్ర విచారణకు జిల్లా ఎస్పీ శబరీశ్ ఆదేశం
'శక్తి' స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సీఐ రఘపతి రెడ్డిపై సమగ్ర విచారణకు జిల్లా ఎస్పీ శబరీశ్ ఆదేశించారు. నిరసన చేపట్టిన విద్యార్థులను అడ్డుకునే క్రమంలో సీఐ రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్తుల గొంతు పట్టుకుని కొంత సేపు వదలలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తారా? ఇదేనా పోలీసులకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. సీఐ తీరుపై సర్వత్రా విమర్శలు రావడంతో ఈఘటనపై సమగ్ర విచారణకు ఎస్పీ ఆదేశించారు.