వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు !


తెలంగాణలోని హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ''సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని, అధికారం కోల్పోయామనే అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని, వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదని అన్నారు. కులగణనతో దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ నిలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధిలో బీఆర్ఎస్ నేతలతో చర్చకు సిద్ధం. అన్ని రకాలుగా ప్రజలను మెప్పించాం. అందుకే విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నామని అన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org