టీడీపీ మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహనరావు మృతి


టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఎంపీ కెంబూరి రామ్మోహనరావు (75) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1989 లో తెలుగుదేశం పార్టీ సభ్యునిగా బొబ్బిలి నియోజకవర్గం నుండి 9వ లోక్ సభకు ఎన్నికయ్యారు. 1949 అక్టోబరు 12న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పుర్లిలో ఆయన జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు .

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org